22 నుండి 27 వరకు బాలారం బంగారు తల్లి ఉత్సవాలు
అల్లూరి జిల్లా ప్రీమియర్ లీగ్ పేరుతో మెగా క్రికెట్ టోర్నమెంట్
మండలంలోని మొదటిసారిగా ఎడ్ల బండ్లు పోటీలు
ఉత్సవ కమిటీ, అప్పన ఆనంద్ కుమార్, గాదిరాజు లక్ష్మీ రాజ్, బంటు నాగేశ్వరరావు
RTVNEWS( లవకుశ)ప్రతి ఏటా అత్యంత వైభవంగా, ఆహ్లాదకరంగా నిర్వహించే బాలారం బంగారు తల్లి జాతర మహోత్సవాలను ఈ నెల 22 నుండి 27 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు. అప్పన ఆనంద్ కుమార్. గాదిరాజు లక్ష్మీ రాజ్, బంటు నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలారం, కిష్టారం, కించలి , గ్రామల పెద్దలు యువత ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ దివంగత శ్రీరాములు జ్ఞాపకార్థం ఈ నెల 9నుండి అల్లూరి సీతారామరాజు ప్రీమియర్ లీగ్ పేరుతో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రధమ బహుమతి 20,000 ద్వితీయ బహుమతి 10000 ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈనెల 23న కొయ్యూరు మండలంలోని మొదటిసారిగా ఎడ్ల బండ్లు పోటీలు, 25న ట్రాక్టర్ రివర్స్ పోటీలను 26 ,27, తేదీల్లో వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అయితే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు 9390 21 9346, 9441 243122 ఇతర వివరాలకు పై నంబర్లను సంప్రదించాలని వారు అన్నారు