ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు
RTVNEWS (లవకుశ)నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో ప్రజలందరూ నడవాలని హిమగిరి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ. ఎం సత్తిబాబు అన్నారు. గురువారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ప్రభుత్వ జూ TVనియర్ కళాశాలలో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ ఎం సత్తిబాబు, కళాశాల ప్రిన్సిపాల్ కె శ్రీహరి తదితరులు మాట్లాడుతూ ధనిక కుటుంబంలో పుట్టి దేశ స్వతంత్రం కోసం ఉన్నత ఉద్యోగాన్ని వధిలి దేశ స్వాంతంత్ర కోసం అనేక ఉద్యమాలు చేశారన్నారు. అటువంటి మహనీయుడు జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అదనపు ప్రిన్సిపాల్ రుత్తల గంగరాజు.. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. ప్రోగ్రాం ఇంచార్జ్. సిహెచ్ వి ఎస్ ఆర్ ప్రసాద్. సనాతన సేవ ఫౌండేషన్ జిల్లా ఇంచార్జ్. సిహెచ్ మాలకొండయ్య. అల్లూరు జిల్లా బీజేపీ నాయకులు అరిమెల రాజు. సమిరెడ్డి దారకొండ అల్లూరిజిల్లా ఓమన్ రైట్స్. అధ్యక్షుడు.,లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు. వి అప్పారావు. అధ్యాపకులు అంకంరెడ్డి శీనివాస్, గోవిందు, నాగేశ్వరి ,రామకృష్ణ, తదితర సిబ్బంది,విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.