గంజాయి నిందితులకు పదేళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరీమానా
ఎక్స్చేంజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి మధుసూదనరావు
RTVNEWS (లవకుశ)నర్సీపట్నం ఎక్సేంజ్ స్టేషన్ పరిధిలో కృష్ణ దేవి పేట జంక్షన్ వద్ద 2018లోపట్టుకున్న ముగ్గురు గంజాయి నిందితులకు పదేళ్ల జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా విధిస్తూమెట్రోపాలిటన్ స్పెషల్ జడ్జ్ ఎం వెంకటరమణ తీర్పు వెలువడించారని గొలుగొండ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి మధుసూదనరావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ 2018 మార్చి 20న నర్సీపట్నంఎక్స్చేంజ్ సిబ్బందికి ముందుగా అందిన సమాచారం మేరకు కృష్ణ దేవి పేట జంక్షన్ లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా కిల్లో జున్ను, కిల్లొ కమల, కిలో సీత తెల్ల రంగు మారుతి కారులో 50 కేజీల గంజాయి తరలిస్తూ నర్సీపట్నం ఎక్సైజ్ సిబ్బందికి పట్టుపడ్డారని అన్నారు. దీనిపై అప్పట్లో చార్జీ సీటు ఫైల్ చేసిన అనంతరం అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జిఎస్ఎన్ వి ప్రసాద్ రావు వాదనలు వినిపించి ముద్దాయిలకు శిక్షపడేలా చేశారని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి మధుసూదనరావు అన్నారు