జిడిపి పై ప్రజాప్రతినిధులకు శిక్షణ
ఎంపీడీవో ఎస్ కే వి ప్రసాద్
నేడుగ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళిక లో భాగంగా మండలంలో ప్రజా ప్రతినిధులందరికీ మండల అభివృద్ధి కార్యాలయం సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని మండల అభివృద్ధి అధికారి ఎస్ కె వి ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళిక సమావేశానికి ఎంపీపీ ,జడ్పిటిసి ,ఎంపీటీసీలు, సర్పంచ్లు, అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన అన్నారు. ముందుగా పంచాయతీ కార్యదర్శులకు డిజిటల్ అసిస్టెంట్లకు వివోఏలకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు