అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
RTVNEWS.కోర్కెలు తీర్చే కల్పవల్లి గిరిజన ప్రాంత ఆరాధ్య దైవం శరభన్నపాలెం, నడింపాలెం గ్రామాల మధ్య కొలువై ఉన్నశ్రీ శ్రీ ఎర్ర కొండమ్మ ఆలయ సన్నిధిలో గురువారం ఎర్రమంబ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్న సమరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు అమ్మవారి సన్నిధిలో ఉదయం నుండి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. యూనియన్ సభ్యులుర్పాటు చేసిన అన్న సమరాధనా కార్యక్రమంలో శరభన్నపాలెం, నడింపాలెం, వెలుగులు పాలెం ,బట్ట పనుకుల తదితరు పంచాయతీల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు