నవంబర్ 30నే పెన్షన్లు పంపిణీ
ఎంపీడీవో ఎఫ్ కెవి ప్రసాద్
RTVNEWS( లవకుశ)కూటమి ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పెన్షన్లు డిసెంబర్ 1 ఆదివారం సెలవు దినం కావడంతో మండలం లో పింఛన్ దారులు అందరికీ నవంబర్ 30న పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని మండల అభివృద్ధి అధికారి ఎస్ కె వి ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెన్షన్ దారులు అందరూ నవంబర్ 30న తమ గ్రామాల్లో అందుబాటులో ఉండాలని అధికారులు తమ ఇండ్లకే తరలి వచ్చి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ విషయాన్ని పెన్షన్ దారులు అందరూ గమనించాలని ఆయన సందర్భంగా తెలిపారు.