రత్నంపేటలో భగవాన్ బిర్సా ముండా150వ జయంతి వేడుకలు
బిజెపి గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు అని రాజు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రీముల చంద్రరావు
.
RTVNEWS:భగవాన్ బిర్సా ముండా ను నేటితరం యువకులు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని బిజెపి పార్టీ గిరిజన మోర్చా అల్లూరి జిల్లా అధ్యక్షులు అరిమెల రాజు, బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వేముల రీముల చంద్రరావు అన్నారు. బిర్సా ముండా 150 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని మండలంలో రత్నంపేట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గిరిజన చైతన్య స్ఫూర్తి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అరిమెల రాజు రిముల చంద్రరావు మాట్లాడుతూ 15వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్రామ గ్రామాన జయంతి వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారన్నారు. బిర్సా ముండా జన్మదినాన్ని నరేంద్ర మోడీ జాతీయ గౌరవ దివాసుగా జరుపుకోవాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దూరి నూకరాజు దూరి భవాని అరిమెల ఈశ్వరరావు తగుడమ్మ పప్పుల వెంకటేష్ విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు